Header Banner

తీవ్ర విషాదం.. ద్వారపూడిలో కారు డోర్ లాక్.. నలుగురు పిల్లలు ఊపిరాడక మృతి!

  Sun May 18, 2025 20:55        India

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కంటోన్మెంట్‌ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో ఆడుకోవడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు ఓ కారులో చిక్కుకుపోయి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు అందించిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. అయితే, చాలాసేపటి వరకు వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా పిల్లల ఆచూకీ లభించలేదు. చివరకు, గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం దగ్గర నిలిపి ఉంచిన ఓ పాత కారులో పిల్లలు కదలకుండా పడి ఉండటాన్ని కొందరు గమనించారు.

 

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లకు తాళాలు! కొత్త ఒత్తిడిలో నిర్మాతలు!

 

వెంటనే కారు దగ్గరకు వెళ్లి చూడగా, అప్పటికే నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయి కనిపించారు. సరదాగా ఆడుకునేందుకు కారులోకి వెళ్లిన చిన్నారులు, ప్రమాదవశాత్తూ డోర్లు లాక్ చేసుకోవడంతో బయటకు రాలేకపోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీంతో, కారులోపల గాలి ఆడక ఊపిరి అందక వారు మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరణించిన చిన్నారులను ఉదయ్‌ (8), చారుమతి (8), చరిష్మా (6) మరియు మనస్విగా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు కావడం మరింత విషాదకరం. ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో ద్వారపూడి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations